మసీదులు, సమూహాల్లో సామాజిక దూరాన్ని తప్పనిసరి చేసిన కువైట్
- January 07, 2022
కువైట్: మసీదులు, వివాహ వేడుకల్లో కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా కువైట్లో మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ని అదుపు చేసే దిశగా ఈ చర్యలు చేపట్టారు. మసీదుల్లో ప్రార్థనలు చేసేవారు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తమ సొంత మ్యాట్లను ప్రార్థనల కోసం తీసుురావడం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మసీదు అధికారులు, తలుపులు అలాగే కిటికీలను ప్రార్థనా సమయాల్లో తెరచి వుంచాలని, శుక్రవారం ప్రార్థనలకు 15 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 9 నుంచి కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే వివాహ కాంట్రాక్టు రాత కార్యక్రమాలకు హాజరవ్వాల్సి వుంటుంది. అన్ని బహిరంగ సమూహాలనీ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









