మసీదులు, సమూహాల్లో సామాజిక దూరాన్ని తప్పనిసరి చేసిన కువైట్

- January 07, 2022 , by Maagulf
మసీదులు, సమూహాల్లో సామాజిక దూరాన్ని తప్పనిసరి చేసిన కువైట్

కువైట్: మసీదులు, వివాహ వేడుకల్లో కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా కువైట్‌లో మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌ని అదుపు చేసే దిశగా ఈ చర్యలు చేపట్టారు. మసీదుల్లో ప్రార్థనలు చేసేవారు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తమ సొంత మ్యాట్లను ప్రార్థనల కోసం తీసుురావడం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మసీదు అధికారులు, తలుపులు అలాగే కిటికీలను ప్రార్థనా సమయాల్లో తెరచి వుంచాలని, శుక్రవారం ప్రార్థనలకు 15 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 9 నుంచి కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే వివాహ కాంట్రాక్టు రాత కార్యక్రమాలకు హాజరవ్వాల్సి వుంటుంది. అన్ని బహిరంగ సమూహాలనీ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com