మసీదులు, సమూహాల్లో సామాజిక దూరాన్ని తప్పనిసరి చేసిన కువైట్
- January 07, 2022
కువైట్: మసీదులు, వివాహ వేడుకల్లో కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా కువైట్లో మళ్ళీ ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ని అదుపు చేసే దిశగా ఈ చర్యలు చేపట్టారు. మసీదుల్లో ప్రార్థనలు చేసేవారు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తమ సొంత మ్యాట్లను ప్రార్థనల కోసం తీసుురావడం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మసీదు అధికారులు, తలుపులు అలాగే కిటికీలను ప్రార్థనా సమయాల్లో తెరచి వుంచాలని, శుక్రవారం ప్రార్థనలకు 15 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 9 నుంచి కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే వివాహ కాంట్రాక్టు రాత కార్యక్రమాలకు హాజరవ్వాల్సి వుంటుంది. అన్ని బహిరంగ సమూహాలనీ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల









