ఏపీ మంత్రి పేర్ని నానితో భేటి కానున్న వర్మ
- January 08, 2022అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడేందుకు రామ్ గోపాల్ వర్మ... మంత్రి పేర్నినానితో భేటీ కానున్నారు. ఈ నెల 10 వ తేదీన మధ్యాహ్నం సమావేశానికి రావాలని... మంత్రి నుంచి ఆహ్వానం అందినట్లు వర్మ ట్విట్టర్లో వెల్లడించారు. సినీరంగ సమస్యలపై అభిప్రాయాలను పంచుకునేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి పేర్నినాని కూడా సమాధానమివ్వడం.. ఆ తర్వాత మళ్లీ వర్మ కౌంటర్ ఇవ్వడంతో... వ్యవహారం రసవత్తరంగా మారింది. చివరికి మంత్రి పేర్ని నాని రామూను చర్చలకు పిలవడంతో... ఈ ట్వీట్ల యుద్ధానికి తెరపడింది. ఇక ఇప్పుడు ముందుగా చెప్పినట్లుగానే... మంత్రి వర్మను సమావేశానికి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి