ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..
- January 09, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.ఆదివారం (జనవరి 9) కొత్తగా 1,257 మంది వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 38, 479శాంపిల్స్ పరీక్షించారు. కాగా వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 140 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి దాకా 3,16,05,951 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 20,78, 964 మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా 20, 59, 685 మంది వైరస్ను జయించారు. మొత్తం 14505 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







