ఓమిక్రాన్ మరో లక్షణం...కాళ్లలో తీవ్రమైన నొప్పి
- January 11, 2022
బెంగళూరు: ప్రపంచం అంతటా ఓమిక్రాన్ చుట్టేస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటున్నాయి.
తాజాగా బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో వైద్యుడు లక్షణాల్లో మార్పును ధృవీకరించారు. "ఒక వ్యక్తికి పాజిటివ్ పరీక్షలు వచ్చినప్పుడు అలసటతో పాటు జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది సాధారణంగా ప్రాథమిక లక్షణాలుగా పరిగణిస్తాం. అయితే, ఈమధ్యన ఓమిక్రాన్ వచ్చిన పీజీ మెడికల్ విద్యార్థిని భూమిక పవార్, తనకు కాలునొప్పి ఎక్కువైందని తెలియజేయటం జరిగింది”అని డాక్టర్ బాను చెప్పారు.
"ఇది తొడ నుండి కాలి వరకు వ్యాపించింది. మొదట్లో అది ఎడమ కాలులో అనిపించినా తర్వాత రెండు కాళ్లు కూడా నొప్పి గా ఉన్నట్టు పవార్ చెప్పారు.
మరో వ్యక్తి మాటల్లో.. జనవరి 3న రాజాజీనగర్లోని స్నేహితుడి స్థలంలో న్యూ ఇయర్ పార్టీ హాజరైన తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన చంద్రకాంత్ గౌడ ఇలా అన్నాడు: “గొంతు దురద కారణంగా నేను మింగలేకపోయాను. నాకు జ్వరం, జలుబు లేదు. మూడవ రోజు, నాకు కాలు నొప్పి వచ్చింది, ఇది నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించనిది, కానీ అది ఒక రోజులో తగ్గింది”అని గౌడ చెప్పారు.
గొంతు నొప్పితో బాధపడేవారు బెటాడిన్తో పుక్కిలించాలని మరియు కాలు నొప్పికి పారాసెటమాల్ (డోలో-650) తీసుకోవాలని డాక్టర్ బాను సూచించారు. లక్షణాలు మరింత తీవ్రమైతే, ఆసుపత్రిలో చేరడం మంచిది అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







