ఓమిక్రాన్ మరో లక్షణం...కాళ్లలో తీవ్రమైన నొప్పి
- January 11, 2022
బెంగళూరు: ప్రపంచం అంతటా ఓమిక్రాన్ చుట్టేస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటున్నాయి.
తాజాగా బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో వైద్యుడు లక్షణాల్లో మార్పును ధృవీకరించారు. "ఒక వ్యక్తికి పాజిటివ్ పరీక్షలు వచ్చినప్పుడు అలసటతో పాటు జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది సాధారణంగా ప్రాథమిక లక్షణాలుగా పరిగణిస్తాం. అయితే, ఈమధ్యన ఓమిక్రాన్ వచ్చిన పీజీ మెడికల్ విద్యార్థిని భూమిక పవార్, తనకు కాలునొప్పి ఎక్కువైందని తెలియజేయటం జరిగింది”అని డాక్టర్ బాను చెప్పారు.
"ఇది తొడ నుండి కాలి వరకు వ్యాపించింది. మొదట్లో అది ఎడమ కాలులో అనిపించినా తర్వాత రెండు కాళ్లు కూడా నొప్పి గా ఉన్నట్టు పవార్ చెప్పారు.
మరో వ్యక్తి మాటల్లో.. జనవరి 3న రాజాజీనగర్లోని స్నేహితుడి స్థలంలో న్యూ ఇయర్ పార్టీ హాజరైన తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన చంద్రకాంత్ గౌడ ఇలా అన్నాడు: “గొంతు దురద కారణంగా నేను మింగలేకపోయాను. నాకు జ్వరం, జలుబు లేదు. మూడవ రోజు, నాకు కాలు నొప్పి వచ్చింది, ఇది నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించనిది, కానీ అది ఒక రోజులో తగ్గింది”అని గౌడ చెప్పారు.
గొంతు నొప్పితో బాధపడేవారు బెటాడిన్తో పుక్కిలించాలని మరియు కాలు నొప్పికి పారాసెటమాల్ (డోలో-650) తీసుకోవాలని డాక్టర్ బాను సూచించారు. లక్షణాలు మరింత తీవ్రమైతే, ఆసుపత్రిలో చేరడం మంచిది అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







