ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

- January 11, 2022 , by Maagulf
ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

మనామా: ఇండియన్ ఎంబసీ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా వీడియో సందేశం పంపారు. బహ్రెయిన్‌లోని ఎనిమిది ఇండియన్ స్కూల్స్, ఇంటర్ స్కూల్ పోటీలను హిందీ పాటలు, పోయెట్రీ మరియు స్టోరీ టెల్లింగ్‌పై పోటీలను నిర్వహించడం జరిగింది. విజేతలకు ఈ ఈవెంట్‌లో బహుమతులు అందజేశారు. వారిని ఎంబసీ ప్రతినిథులు అభినందించారు. బహ్రెయిన్‌లోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, టీచర్లుగా పనిచేస్తున్న భారతీయులు.. ఇలా ఈ కార్యక్రమంలో 250 మంది వరకు భాగం పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com