త్వరలో 'తొలి కిరణం' చిత్రం ఆడియో విడుదల

- March 26, 2016 , by Maagulf

ఏసుక్రీస్తు జీవితం మళ్లీ తెర మీదకు రావడానికి సిద్ధమవుతోంది. పీడి రాజు ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం 'తొలి కిరణం'. ఆర్ .పి.పట్నాయక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.దర్శకుడు మాట్లాడుతూ- ''ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ వేడుక కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నిర్మించాం.
వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, ఎడిటింగ్: వినయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com