శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- January 11, 2022
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.మంగళవారం కస్టమ్స్ అధికారులు ముగ్గురు మహిళల నుంచి 1481.10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసారు.పట్టుకున్న బంగారం విలువ రూ.72.80లక్షల విలువ ఉంటుందని పేర్కొంది.దుబాయ్ నుంచి 6E 8422 ఫ్లైట్ ద్వారా వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తరలిస్తుండగా..రూ.48.71లక్షల విలువైన 991 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి కువైట్ మీదుగా వచ్చిన J9-1403 విమానంలో వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని పురీషనాళం దాచి తరలించింది. సదరు మహిళను గుర్తించి ఆమె వద్ద నుంచి రూ.8.28 లక్షల విలువైన 168.5 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి 6E 8422 నంబరు గల విమానంలో వచ్చిన మరో మహిళ బంగారాన్ని తరలిస్తుండగా రూ.15.81లక్షల విలువైన 321.60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







