శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- January 11, 2022
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.మంగళవారం కస్టమ్స్ అధికారులు ముగ్గురు మహిళల నుంచి 1481.10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసారు.పట్టుకున్న బంగారం విలువ రూ.72.80లక్షల విలువ ఉంటుందని పేర్కొంది.దుబాయ్ నుంచి 6E 8422 ఫ్లైట్ ద్వారా వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తరలిస్తుండగా..రూ.48.71లక్షల విలువైన 991 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి కువైట్ మీదుగా వచ్చిన J9-1403 విమానంలో వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని పురీషనాళం దాచి తరలించింది. సదరు మహిళను గుర్తించి ఆమె వద్ద నుంచి రూ.8.28 లక్షల విలువైన 168.5 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి 6E 8422 నంబరు గల విమానంలో వచ్చిన మరో మహిళ బంగారాన్ని తరలిస్తుండగా రూ.15.81లక్షల విలువైన 321.60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







