తెలంగాణ కరోనా అప్డేట్
- January 14, 2022
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుంది.దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది.ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 కరోనా కేసులు పెరిగాయి.రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం .. తాజాగా 2,398 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన కరోనా కేసుల సంఖ్య 7,05,199 కు చేరింది.నేడు కరోనా కారణంగ ముగ్గురు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య పెరుగుతుంది.ప్రతి రోజు ఒకరు లేదా ఇద్దరూ కరోనా తో మరణించే వారు ఎక్కువ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4,052 కు చేరింది. కాగా ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







