మహిళా నిరసనకారులపై తాలిబాన్ల పెప్పర్ స్ప్రే
- January 17, 2022
అఫ్ఘానిస్తాన్ రాజధానిలో మహిళా నిరసనాకారులను చెదరగొట్టేందుకు తాలిబాన్లు పెప్పర్ స్ప్రే వినియోగించారు. పని, విద్య లాంటి తమ హక్కులను తిరిగి తమకు కల్పించాలని ఆదివారం ఆందోళన చేపట్టారు.
ఆగష్టు నుంచి దేశం మొత్తాన్ని ఆదీనంలోకి తీసుకున్న తాలిబాన్లు పలు నిబంధనలతో ప్రత్యేకించి మహిళలను కట్టడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కాబుల్ యూనివర్సిటీ ఎదురుగా దాదాపు 20మంది మహిళల గుంపు సమానత్వం, న్యాయం అంటూ నినాదాలు చేస్తూ మహిళా హక్కులు, మానవ హక్కుల బోర్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత తాలిబాన్ ఫైటర్లు పలు వాహనాల్లో అక్కడికి రాగానే అంతా పరారయ్యారు.
‘కాబూల్ యూనివర్సిటీ దగ్గర్లో ఉండగా మూడు తాలిబాన్ వాహనాలు వచ్చాయి. ఒక వాహనం నుంచి మా మీద పెప్పర్ స్ప్రే చేయడం మొదలుపెట్టారు. కంట్లో పడటంతో సిగ్గులేదా అని గట్టిగా అరిచాను. అంతే అందులో ఒకరు నా మీద గన్ గురి పెట్టారు’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరో ఇద్దరు మహిళలను హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







