యూఏఈ నుంచి వచ్చేవారికి నో రూల్స్..
- January 17, 2022
ముంబై: బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆదివారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులైన యూఏఈ నుంచి వచ్చేవారు సైతం ఆర్టీ-పీసీఆర్, ఏడు రోజుల హోం క్వారంటైన్ నుంచి మినహాయించారు.
రిస్క్ తో కూడిన దేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే గైడ్ లైన్స్ అప్లై అవుతాయని చెప్పింది.
2022 జనవరి 17 సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలుకానున్నట్లు తెలిపారు. బీఎంసీ కమిషనర్ ఇఖ్బాల్ సింగ్ చాహల్ అధ్యక్షతన జరిగిన సివిల్ అఫీషియల్స్, డీన్స్, మెడికల్ సూపరిండెంట్స్ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు.
ముంబైలో తారాస్థాయికి చేరిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోసారి కేసులు పెరిగే అవకాశం ఉందని డా.శశాంక్ జోషి హెచ్చరించారు. శనివారం ఒక్కరోజే 11కొవిడ్ మృతులు సంభవించగా తాజాగా 10వేల 661 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా 21వేల 474మంది పేషెంట్లు డిశ్చార్జ్ కాగా 8లక్షల 99వేల 358మంది రికవరీ అయ్యారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









