దిల్లీ చేరుకున్నపాకిస్థాన్ దర్యాప్తు బృందం
- March 27, 2016పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ నిమిత్తం పాకిస్థాన్కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం ఆదివారం దిల్లీ చేరుకుంది. ఐఎస్ఐ ప్రతినిధులతో సహా, మిలిటరీ ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందం ఈ విచారణ చేపట్టనుంది. మార్చి 29న ఈ బృందం పఠాన్కోట్లో పర్యటించనుంది.పాక్లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టనుంది. అయితే దర్యాప్తులో భాగంగా ఈ బృందం కేవలం ప్రత్యక్ష సాక్షులను మాత్రమే కలిసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.జాతీయ భద్రతాదళం, సరిహద్దు భద్రతాదళం సిబ్బందిని వీరు విచారించకూడదు. అంతేగాక, పఠాన్కోట్లోని కీలక ప్రాంతాల్లోకి కూడా వీరిని అనుమతించడంలేదు. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్లో దర్యాప్తు జరపడం ఇదే తొలిసారి.పఠాన్కోట్లోని ఎయిర్బేస్లో జనవరి 2న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎయిర్బేస్లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చారు. కాగా.. ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో ఏడుగురు భద్రతాసిబ్బంది అమరులయ్యారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ