దిల్లీ చేరుకున్నపాకిస్థాన్ దర్యాప్తు బృందం
- March 27, 2016
పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై విచారణ నిమిత్తం పాకిస్థాన్కు చెందిన ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం ఆదివారం దిల్లీ చేరుకుంది. ఐఎస్ఐ ప్రతినిధులతో సహా, మిలిటరీ ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందం ఈ విచారణ చేపట్టనుంది. మార్చి 29న ఈ బృందం పఠాన్కోట్లో పర్యటించనుంది.పాక్లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టనుంది. అయితే దర్యాప్తులో భాగంగా ఈ బృందం కేవలం ప్రత్యక్ష సాక్షులను మాత్రమే కలిసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.జాతీయ భద్రతాదళం, సరిహద్దు భద్రతాదళం సిబ్బందిని వీరు విచారించకూడదు. అంతేగాక, పఠాన్కోట్లోని కీలక ప్రాంతాల్లోకి కూడా వీరిని అనుమతించడంలేదు. పొరుగుదేశం నుంచి ఒక దర్యాప్తు బృందం ఉగ్రదాడి ఘటనపై భారత్లో దర్యాప్తు జరపడం ఇదే తొలిసారి.పఠాన్కోట్లోని ఎయిర్బేస్లో జనవరి 2న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎయిర్బేస్లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చారు. కాగా.. ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో ఏడుగురు భద్రతాసిబ్బంది అమరులయ్యారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









