తిరుమల తిరుపతి లో ఉచిత వివాహాలు
- March 27, 2016తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. త్వరలోనే కళ్యాణం పథకాన్ని ప్రారంభిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. కళ్యాణం పథకం కింద ఉచిత వివాహాలు జరిపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహం చేసుకునేందుకు పురోహితులకు రూ.500, మేళానికి రూ.300, వీడియో తీసుకుంటే విద్యుత్తు ఛార్జీలకు రూ.60 వసూలు చేస్తున్నారని, ఇకపై వీటిని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు నూతన వధూవరులను సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారని, ఇకపై రూ.300 శీఘ్రదర్శనం క్యూలైన్లో ఉచితంగా దర్శనానికి పంపుతామని వెల్లడించారు. తిరుమల కల్యాణవేదికలో సంవత్సరం పొడవునా వివాహాలు జరుగుతున్నాయని, మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు రోజుకు 250కి పైగా జంటలు ఒక్కటవుతున్నాయన్నారు.వివాహం చేసుకున్న నూతన జంటలకు పసుపు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పది చిన్న లడ్డూలు అందజేస్తామన్నారు. వివాహాల తేదీని బుక్ చేసుకునేందుకు వీలుగా త్వరగా ఆన్లైన్ ఆప్లికేషన్ను రూపొందించాలని అధికారులను ఈవో ఆదేశించారు. కల్యాణవేదిక ప్రాంగణంలో ప్రభుత్వ వివాహ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి వివాహం జరిగిన అరగంటలోపే ధ్రువీకరణ పత్రం అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక