తిరుమల తిరుపతి లో ఉచిత వివాహాలు
- March 27, 2016
తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. త్వరలోనే కళ్యాణం పథకాన్ని ప్రారంభిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. కళ్యాణం పథకం కింద ఉచిత వివాహాలు జరిపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహం చేసుకునేందుకు పురోహితులకు రూ.500, మేళానికి రూ.300, వీడియో తీసుకుంటే విద్యుత్తు ఛార్జీలకు రూ.60 వసూలు చేస్తున్నారని, ఇకపై వీటిని రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు నూతన వధూవరులను సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారని, ఇకపై రూ.300 శీఘ్రదర్శనం క్యూలైన్లో ఉచితంగా దర్శనానికి పంపుతామని వెల్లడించారు. తిరుమల కల్యాణవేదికలో సంవత్సరం పొడవునా వివాహాలు జరుగుతున్నాయని, మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు రోజుకు 250కి పైగా జంటలు ఒక్కటవుతున్నాయన్నారు.వివాహం చేసుకున్న నూతన జంటలకు పసుపు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పది చిన్న లడ్డూలు అందజేస్తామన్నారు. వివాహాల తేదీని బుక్ చేసుకునేందుకు వీలుగా త్వరగా ఆన్లైన్ ఆప్లికేషన్ను రూపొందించాలని అధికారులను ఈవో ఆదేశించారు. కల్యాణవేదిక ప్రాంగణంలో ప్రభుత్వ వివాహ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి వివాహం జరిగిన అరగంటలోపే ధ్రువీకరణ పత్రం అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









