డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పైలట్

- January 21, 2022 , by Maagulf
డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పైలట్

సౌదీ అరేబియా: పని వేళలను ఉద్యోగులు సీరియస్ గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపే ఘటన ఇది.షిఫ్ట్ టైం ముగిశాక.. ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పే ఘటన ఇది. ఒక విమాన పైలట్ అనూహ్య నిర్ణయం ప్రయాణికులకు శాపంగా మారిన ఘటన ఇది. తన డ్యూటీ టైం ముగిసిందంటు ఓ పైలట్ విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన ఆ పైలట్, విమాన ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.

వివరాల్లోకి వెళితే PIAకు చెందిన PK-9754 విమానం జనవరి 16న రియాద్ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో వాతావరణం సహకరించక విమానాన్ని దమ్మామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. తిరిగి ప్రయాణం కొనసాగించాల్సిన సమయానికి పైలట్ లలో ఒకరు తన షిఫ్ట్ టైం ముగిసిందని, విమానం నడిపేందుకు రాలేనని తాపీగా హోటల్ కు వెళ్ళిపోయాడు.దీంతో కంగుతిన్న కో-పైలట్ విషయాన్నీ PIA యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు.

ఇంతలో విమానంలోని ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం దిగబోమని, తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిందే అంటూ పట్టుబట్టారు.పరిస్థితి చేయిదాటి పోతుండడంతో విమానాశ్రయం సెక్యూరిటీ అప్రమత్తం అయి.. ప్రయాణికులకు సర్ది చెప్పారు. అనంతరం వారందరికీ స్థానిక హోటల్ లో బస ఏర్పటుచేసి, పైలట్ తిరిగి వచ్చాక ప్రయాణం కొనసాగించారు.దీనిపై PIA సంస్థ ప్రతినిధి స్పందిస్తూ..పైలట్లకు విశ్రాంతి ఎంతో అవసరమని, తమ పైలట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వెనకేసుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com