'భోళాశంకర్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
- January 21, 2022
హైదరాబాద్: రోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో స్టార్ హీరోలంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. ప్రస్తుతం షూటింగ్స్కు హాజరవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాల షూటింగ్స్లో పాల్గొనడం లేదు. అయితే తాజాగా ఆయన మళ్ళీ మేకప్ వేసుకున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భోళాశంకర్’ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ రోజే (శుక్రవారం) ప్రారంభమైనట్టు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో 12 రోజుల పాటు టాకీని తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, కీర్తి సురేశ్ తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
కాఫీ షాప్ నేపథ్యంలో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. అజిత్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేశ్ చిరుకి చెల్లెలిగా మెప్పించబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







