'భోళాశంకర్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
- January 21, 2022హైదరాబాద్: రోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో స్టార్ హీరోలంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. ప్రస్తుతం షూటింగ్స్కు హాజరవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాల షూటింగ్స్లో పాల్గొనడం లేదు. అయితే తాజాగా ఆయన మళ్ళీ మేకప్ వేసుకున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భోళాశంకర్’ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ రోజే (శుక్రవారం) ప్రారంభమైనట్టు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో 12 రోజుల పాటు టాకీని తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, కీర్తి సురేశ్ తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
కాఫీ షాప్ నేపథ్యంలో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. అజిత్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేశ్ చిరుకి చెల్లెలిగా మెప్పించబోతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ