'భోళాశంకర్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
- January 21, 2022
హైదరాబాద్: రోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో స్టార్ హీరోలంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. ప్రస్తుతం షూటింగ్స్కు హాజరవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాల షూటింగ్స్లో పాల్గొనడం లేదు. అయితే తాజాగా ఆయన మళ్ళీ మేకప్ వేసుకున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భోళాశంకర్’ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ రోజే (శుక్రవారం) ప్రారంభమైనట్టు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో 12 రోజుల పాటు టాకీని తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, కీర్తి సురేశ్ తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
కాఫీ షాప్ నేపథ్యంలో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. అజిత్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేశ్ చిరుకి చెల్లెలిగా మెప్పించబోతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







