ఎస్‌‌బీఐ కస్టమర్లు అలర్ట్

- January 21, 2022 , by Maagulf
ఎస్‌‌బీఐ కస్టమర్లు అలర్ట్

ముంబై: భారత దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐ (SBI) వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. ఆన్ లైన్ బ్యాంకింగ్ నిర్వహిస్తున్న వారికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. 2022, జనవరి 22వ తేదీ శనివారం ఆన్ లైన్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయని…బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా…జనవరి 22వ తేదీ 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు పని చేయవంటూ..అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గత కొంతకాలంగా టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియను ఎస్బీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 22 వేళ శాఖలు, 57 వేల 889 ఏటీఎం కేంద్రాలు దీనికి ఉన్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా అప్ గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టగా..కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com