భారత్ కరోనా అప్డేట్
- January 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 3,37, 704 నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య 488గా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.43 శాతంగా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 17.22 శాతానికి చేరుకున్నాయి. రోజువారీ కరోనా పాజిటివిటి రేటు కూడా పెరిగింది.
దేశంలో ఇప్పటివరకు 3,89,03,731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,88,884 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో 93.31 శాతంగా కరోన రికవరీ రేటు నమోదైంది.. అలాగే శుక్రవారం ఒక్కరోజే కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,63,01,482 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







