భారత్ కరోనా అప్డేట్

- January 22, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 3,37, 704 నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య 488గా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.43 శాతంగా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు 17.22 శాతానికి చేరుకున్నాయి. రోజువారీ కరోనా పాజిటివిటి రేటు కూడా పెరిగింది.

దేశంలో ఇప్పటివరకు 3,89,03,731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,88,884 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో 93.31 శాతంగా కరోన రికవరీ రేటు నమోదైంది.. అలాగే శుక్రవారం ఒక్కరోజే కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,63,01,482 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com