‘కొండా’ ట్రైలర్ విడుదల
- January 26, 2022
వరంగల్: సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు.
తాజాగా ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కంటే ముందే ఈ సినిమాలో కథేంటో ఒక వీడియోతో చెప్పి ట్రైలర్ కంటే ముందే రిలీజ్ చేశారు. తాజాగా ‘కొండా’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కొండా మురళి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? సురేఖతో ప్రేమ? సురేఖ కొండా మురళికి ఎలా సపోర్ట్ చేసింది? కొండా మురళి మీద జరిగిన హత్యాయత్నం, నక్సలైట్ల నేపథ్యం… ఇలాంటి అంశాలన్నీ చూపించినట్లు తెలుస్తుంది.
ట్రైలర్ లో ఆర్జీవీ మార్క్ కనపడింది. చివరగా నా పేరు కొండా మురళి అంటూ ఈ ట్రైలర్ ని ముగించాడు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయ నేపథ్యం, తెలంగాణ నక్సలైట్లు, మావోయిస్టుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై తెలంగాణలో మరింత ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







