మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
- January 26, 2022
హైదరాబాద్: ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు.రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు.
”నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లక్షణాలతో కరోనా సోకింది.నిన్న రాత్రి కరోనా అని తెలియడంతో నేను ఐసోలేషన్ లోనే ఉన్నాను.ఇటీవల నన్ను కాంటాక్ట్ అయిన వాళ్లంతా టెస్ట్ చేయించుకోండి. త్వరలోనే మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను” అని చిరంజీవి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.చిరంజీవికి కరోనా రావడంతో ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్స్ వాయిదా పడనున్నాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









