మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
- January 26, 2022హైదరాబాద్: ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు.రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు.
”నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లక్షణాలతో కరోనా సోకింది.నిన్న రాత్రి కరోనా అని తెలియడంతో నేను ఐసోలేషన్ లోనే ఉన్నాను.ఇటీవల నన్ను కాంటాక్ట్ అయిన వాళ్లంతా టెస్ట్ చేయించుకోండి. త్వరలోనే మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను” అని చిరంజీవి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.చిరంజీవికి కరోనా రావడంతో ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్స్ వాయిదా పడనున్నాయి.
తాజా వార్తలు
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..