జిసిసిలో తొలిసారిగా కాసినో ప్రారంభించనున్న యూఏఈ
- January 26, 2022
యూఏఈ: హోటల్ మరియు కాసినో నిర్వాహణలో పేరున్న వియాన్ రిసార్ట్స్, త్వరలో రస్ అల్ ఖైమాలో లగ్జరీ రిసార్టుని నిర్మించనుంది. గేమింగ్ ఏరియాతో దీన్ని ఏర్పాటు చేస్తారు. తొలిసారిగా ఓ ముస్లిం గల్ప్ దేశంలో గ్యాంబ్లింగ్కి దీని ద్వారా లైన్ క్లియర్ అయినట్లు భావించాలి. గేమింగ్తోపాటుగా గ్యాంబ్లింగ్ కూడా వుంటుందా.? లేదా.? అన్నదానిపై వియాన్ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి వున్నా, వినోదానికి సంబంధించి నిబంధనల్లో ఖచ్చితంగా మార్పులు రాబోతున్నాయని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు కొత్త డిపార్టుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ రెగ్యులేషన్ని కూడా ఏర్పాటు చేశారు. టూరిజం మరియు బిజినెస్ హబ్గా వున్న యూఏఈలో ఈ గ్యాంబ్లింగ్ గేమింగ్ సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టనుంది. 2026 నాటికి వియాన్ సంస్థ ఈ వినోద కేంద్రాన్ని పూర్తి చేయనుంది. మానవ నిర్మిత ఐలాండ్ అల్ మర్జాన్లో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్







