జిసిసిలో తొలిసారిగా కాసినో ప్రారంభించనున్న యూఏఈ
- January 26, 2022
యూఏఈ: హోటల్ మరియు కాసినో నిర్వాహణలో పేరున్న వియాన్ రిసార్ట్స్, త్వరలో రస్ అల్ ఖైమాలో లగ్జరీ రిసార్టుని నిర్మించనుంది. గేమింగ్ ఏరియాతో దీన్ని ఏర్పాటు చేస్తారు. తొలిసారిగా ఓ ముస్లిం గల్ప్ దేశంలో గ్యాంబ్లింగ్కి దీని ద్వారా లైన్ క్లియర్ అయినట్లు భావించాలి. గేమింగ్తోపాటుగా గ్యాంబ్లింగ్ కూడా వుంటుందా.? లేదా.? అన్నదానిపై వియాన్ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి వున్నా, వినోదానికి సంబంధించి నిబంధనల్లో ఖచ్చితంగా మార్పులు రాబోతున్నాయని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు కొత్త డిపార్టుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ రెగ్యులేషన్ని కూడా ఏర్పాటు చేశారు. టూరిజం మరియు బిజినెస్ హబ్గా వున్న యూఏఈలో ఈ గ్యాంబ్లింగ్ గేమింగ్ సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టనుంది. 2026 నాటికి వియాన్ సంస్థ ఈ వినోద కేంద్రాన్ని పూర్తి చేయనుంది. మానవ నిర్మిత ఐలాండ్ అల్ మర్జాన్లో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- ఈద్ అల్ ఫితర్: GCC కంట్రీస్ టూర్లకు ప్రాధాన్యత ఎందుకు?
- ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!









