జిసిసిలో తొలిసారిగా కాసినో ప్రారంభించనున్న యూఏఈ
- January 26, 2022
యూఏఈ: హోటల్ మరియు కాసినో నిర్వాహణలో పేరున్న వియాన్ రిసార్ట్స్, త్వరలో రస్ అల్ ఖైమాలో లగ్జరీ రిసార్టుని నిర్మించనుంది. గేమింగ్ ఏరియాతో దీన్ని ఏర్పాటు చేస్తారు. తొలిసారిగా ఓ ముస్లిం గల్ప్ దేశంలో గ్యాంబ్లింగ్కి దీని ద్వారా లైన్ క్లియర్ అయినట్లు భావించాలి. గేమింగ్తోపాటుగా గ్యాంబ్లింగ్ కూడా వుంటుందా.? లేదా.? అన్నదానిపై వియాన్ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి వున్నా, వినోదానికి సంబంధించి నిబంధనల్లో ఖచ్చితంగా మార్పులు రాబోతున్నాయని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు కొత్త డిపార్టుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ రెగ్యులేషన్ని కూడా ఏర్పాటు చేశారు. టూరిజం మరియు బిజినెస్ హబ్గా వున్న యూఏఈలో ఈ గ్యాంబ్లింగ్ గేమింగ్ సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టనుంది. 2026 నాటికి వియాన్ సంస్థ ఈ వినోద కేంద్రాన్ని పూర్తి చేయనుంది. మానవ నిర్మిత ఐలాండ్ అల్ మర్జాన్లో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









