రాజకీయాలకతీతంగా మిషన్‌ కాకతీయ పనులు..

- March 28, 2016 , by Maagulf
రాజకీయాలకతీతంగా మిషన్‌ కాకతీయ పనులు..

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఏప్రిల్‌ 1 నుంచి మిషన్‌ కాకతీయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా మిషన్‌ కాకతీయ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.2 వేల కోట్లతో 8 వేల చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. అదే విధంగా రెండో విడతలో 9 వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. మిషన్‌ కాకతీయకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com