దశ, దిశ లేని బడ్జెట్ ఇది: తెలంగాణ సీఎం కెసిఆర్
- February 01, 2022
హైదరాబాద్ : నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కెసిఆర్ స్పందించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇదో గోల్ మాల్ బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందన్నారు. ఇది పసలేని పనికిమాలిన బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ దిశా నిర్దేశం లేని బడ్జెట్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బడ్జెట్ మొత్తం మాటల గారడీలా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం విచిత్రమన్నారు. పన్నుచెల్లింపుదారుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు.”దశ-దిశ లేని బడ్జెట్ ఇది. నిరాశ నిస్పృహల బడ్జెట్. పసలేని, పనికిమాలిన బడ్జెట్. అన్ని వర్గాల వారిని నిరాశపర్చింది. కేంద్రమంత్రి ప్రసంగం మొత్తం డొల్ల కేంద్రం విమర్శించారు. జబ్బలు చరుచుకోవడం తప్ప ఏమీ లేదు’ అని కేసీఆర్ అన్నారు
తాజా వార్తలు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!









