సౌదీలో ఇఖామా, రీ-ఎంట్రీ వీసా గడువు పొడిగింపు
- February 05, 2022
సౌదీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించిన 19 దేశాల నుండి వచ్చిన ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా) చెల్లుబాటు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. తాజా నిర్ణయంతో ఆయా దేశాల వారు ప్రయోజనం పొందుతారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. 19 దేశాల్లో టర్కీ, లెబనాన్, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, మొజాంబిక్, బోట్స్వానా, లెసోతో, ఎస్వతిని, మలావి, జాంబియా, మడగాస్కర్, అంగోలా, సీషెల్స్, మారిషస్, కొమొరోస్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాలకు ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా చెల్లుబాటును ఆటోమెటిక్ గా పొడిగించడం ప్రారంభించినట్లు జవాజాత్ ప్రకటించింది. అయితే ఒక డోస్ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రవాసులకు ఈ పొడిగింపు వర్తించదు. అలాగే విజిట్ వీసాల చెల్లుబాటు గడువును కూడా పొడిగించడం జరిగిందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







