ప్రయాణ నిబంధనలు సడలించిన యూఏఈ
- February 05, 2022
యూఏఈ: పూర్తి డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిటిజన్స్ కు ట్రావెల్ నిబంధనలను సడలించారు. 12 ఆఫ్రికన్ దేశాలతో సహా గతంలో ట్రావెల్ బ్యాన్ విధించిన అన్ని దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ మేరకు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) వెల్లడించింది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 6 (ఆదివారం) నుండి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు సడలించిన ఆఫ్రికా దేశాల్లో కెన్యా, టాంజానియా, ఇథియోపియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, ఎస్వాటిని, లెసోతో, మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోని (మెడికల్ మినహాయింపు) ఉన్నవారి మాత్రం సామాజిక దూరం, మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి కొవిడ్-19 నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







