మోడీ ను స్వాగతించేందుకు వెళ్లలేని కేసీఆర్

- February 05, 2022 , by Maagulf
మోడీ ను స్వాగతించేందుకు వెళ్లలేని కేసీఆర్

హైదరాబాద్: నేడు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకడమే కాకుండా... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్‌ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం లేదని తెలుస్తోంది. కాగా.. కేసీఆర్ స్వాగత కార్యక్రమం వరకే దూరంగా ఉంటారో... లేదంటే అన్ని కార్యక్రమాలకూ దూరంగా ఉంటారో తెలియాల్సి ఉంది. కాగా.. ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమంలో మాత్రం కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. మొత్తానికి ఆఖరి నిమిషంలో అంతా తారుమారై.. మోదీకి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేకపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com