మోడీ ను స్వాగతించేందుకు వెళ్లలేని కేసీఆర్
- February 05, 2022
హైదరాబాద్: నేడు ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా... శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లడం లేదని తెలుస్తోంది. కాగా.. కేసీఆర్ స్వాగత కార్యక్రమం వరకే దూరంగా ఉంటారో... లేదంటే అన్ని కార్యక్రమాలకూ దూరంగా ఉంటారో తెలియాల్సి ఉంది. కాగా.. ముచ్చింతల్ల్లో జరిగే కార్యక్రమంలో మాత్రం కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. మొత్తానికి ఆఖరి నిమిషంలో అంతా తారుమారై.. మోదీకి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేకపోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







