జ్వరం కారణంగా రాలేని కేసీఆర్..ప్రధానికి స్వాగతం పలికిన తలసాని
- February 05, 2022
హైదరాబాద్ : ముందుగా అనుకున్నట్టే జరిగింది. ప్రధాని మోదీకి జీఎంఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగం పలికారు. తలసానితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం.. వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్లలేకపోయారు. మోదీ ఎయిర్పోర్టు నుంచి నేరుగా పఠాన్చేరులోని ఇక్రిశాట్కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించనున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ముచ్చింతాల్లో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..







