భారత్ కరోనా అప్డేట్
- February 06, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.గడిచిన 24 గంటల్లో 14,48,513 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,07,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కి చేరింది.నిన్న865 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,01,979కి చేరింది.
ఒక్క రోజులో 2,13,246 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,04,61,148కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.64 శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 7.42 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 48,09,498 మందికి వ్యాక్సిన్ లు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69.46,26,697 డోసులను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..







