ప్లిఫ్ కార్ట్ యూజర్లకు గొప్ప అవకాశం..
- February 14, 2022
న్యూ ఢిల్లీ: ఫోన్ యూజర్లకు గొప్ప అవకాశం కల్పిస్తోంది ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్ కార్ట్. పాత ఫోన్ ఇవ్వండి, కొత్త ఫోన్ తీసుకోండి అంటూ సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్ ను తీసకోవడం లేదా ఇతర కొత్త ప్రాడెక్ట్ లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే సందర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేసింది. రీ కామర్స్ సంస్థ సాయంతో పాత ఫోన్ లను కలెక్ట్ చేస్తుంది. యూజర్లు చేయాల్సింది యంత్ర వెబ్ సైట్ లోకి వెళ్లి ఫోన్ లకు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ సమాధానాల అనంతరం 48 గంటల్లో ప్లిఫ్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్ ను కలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కు ప్లిఫ్ కార్ట్ ఈ వోచర్ ను పంపిస్తుంది. దీని ద్వారా… ప్లిఫ్ కార్ట్ లో కొత్త ఫోన్ లేదా ఇతర ప్రాడక్ట్స్ కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న 1700 పిన్ కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లను ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే..ఫోన్ ను అమ్ముకొనే ఛాన్స్ ను ప్లిఫ్ కార్ట్ లో అమ్మే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







