షార్జా సఫారీ రేపే ప్రారంభం: టిక్కెట్ల ధరలు, సమయాల ప్రకటన
- February 16, 2022
యూఏఈ: షార్జా సఫారీ ఫిబ్రవరి 17 నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది.ఆఫ్రికా వెలుపల ఇదే అతి పెద్ద పార్కుగా చెప్పబడుతోంది.అల్ దయిద్లో దీన్ని ఏర్పాటు చేశారు. 8 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 120 జంతువులు అలాగే 100,000కి పైగా ఆఫ్రికన్ చెట్లతో దీన్ని తీర్చిదిద్దారు.టిక్కెట్ల ధరల విషయానికొస్తే, బ్రాంజ్ టిక్కెట్లు (వాకింగ్ టూర్) 12 ఏళ్ళు పైబడినవారికి 40 దిర్హాములతోనూ, 3 నుంచి 12 ఏళ్ళ వయసు చిన్నారులకు 15 దిర్హాములతోనూ పార్కులోకి ప్రవేశం కల్పిస్తారు.రెండు నుంచి మూడు గంటల సమయం అనుమతిస్తారు. సిల్వర్ టిక్కెట్ల ధర 12 ఏళ్ళ పైబడిన వారికి 120 దిర్హాములు కాగా, చిన్నారులకు 50 దిర్హాములు. సాధారణ బస్సులో సీటు రిజర్వ్ చేయబడుతుంది.ఐదు నుంచి ఆరు గంటల సమయం వుంటుంది.గోల్డ్ టిక్కెట్ల ధర 275 దిర్హాములుగా వుంది పెద్దలకి.అదే పిల్లలకైతే 120 దిర్హాములు.లగ్జరీ వాహనంలో సీట్ రిజర్వ్ చేయబడుతుంది.ప్రివిలేజ్ గైడ్ ద్వారా సఫారీలోని అన్ని ప్రాంతాలూ చూపిస్తారు.ఐదు నుంచి ఆరు గంటల సమయం వుంటుంది.ఆరుగురు వ్యక్తులకు లగ్జరీ వెహికిల్ ధర 500 దిర్హాములు.తొమ్మిది మందికి 2,250 దిర్హాములు. 15 మందికి 3,500 దిర్హాములు. ఉదయం 8.30 నిమిషాల నుంచి సాయంత్రం 6.30 నిమిషాల వరకు సందర్శన సమయం.మధ్యాహ్నం 2 గంటల వరకు గోల్డ్ మరియు సిల్వర్ టిక్కెట్లు కలిగినవారికి అనుమతిస్తారు.బ్రాంజ్ టిక్కెట్లున్నవారికి సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..







