షార్జా సఫారీ రేపే ప్రారంభం: టిక్కెట్ల ధరలు, సమయాల ప్రకటన
- February 16, 2022
యూఏఈ: షార్జా సఫారీ ఫిబ్రవరి 17 నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది.ఆఫ్రికా వెలుపల ఇదే అతి పెద్ద పార్కుగా చెప్పబడుతోంది.అల్ దయిద్లో దీన్ని ఏర్పాటు చేశారు. 8 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 120 జంతువులు అలాగే 100,000కి పైగా ఆఫ్రికన్ చెట్లతో దీన్ని తీర్చిదిద్దారు.టిక్కెట్ల ధరల విషయానికొస్తే, బ్రాంజ్ టిక్కెట్లు (వాకింగ్ టూర్) 12 ఏళ్ళు పైబడినవారికి 40 దిర్హాములతోనూ, 3 నుంచి 12 ఏళ్ళ వయసు చిన్నారులకు 15 దిర్హాములతోనూ పార్కులోకి ప్రవేశం కల్పిస్తారు.రెండు నుంచి మూడు గంటల సమయం అనుమతిస్తారు. సిల్వర్ టిక్కెట్ల ధర 12 ఏళ్ళ పైబడిన వారికి 120 దిర్హాములు కాగా, చిన్నారులకు 50 దిర్హాములు. సాధారణ బస్సులో సీటు రిజర్వ్ చేయబడుతుంది.ఐదు నుంచి ఆరు గంటల సమయం వుంటుంది.గోల్డ్ టిక్కెట్ల ధర 275 దిర్హాములుగా వుంది పెద్దలకి.అదే పిల్లలకైతే 120 దిర్హాములు.లగ్జరీ వాహనంలో సీట్ రిజర్వ్ చేయబడుతుంది.ప్రివిలేజ్ గైడ్ ద్వారా సఫారీలోని అన్ని ప్రాంతాలూ చూపిస్తారు.ఐదు నుంచి ఆరు గంటల సమయం వుంటుంది.ఆరుగురు వ్యక్తులకు లగ్జరీ వెహికిల్ ధర 500 దిర్హాములు.తొమ్మిది మందికి 2,250 దిర్హాములు. 15 మందికి 3,500 దిర్హాములు. ఉదయం 8.30 నిమిషాల నుంచి సాయంత్రం 6.30 నిమిషాల వరకు సందర్శన సమయం.మధ్యాహ్నం 2 గంటల వరకు గోల్డ్ మరియు సిల్వర్ టిక్కెట్లు కలిగినవారికి అనుమతిస్తారు.బ్రాంజ్ టిక్కెట్లున్నవారికి సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







