ఈద్ సెలవుల్లో విమాన ఛార్జీలు రెట్టింపు

- February 19, 2022 , by Maagulf
ఈద్ సెలవుల్లో విమాన ఛార్జీలు రెట్టింపు

యూఏఈ: ఈద్ సెలవుల్లో విమాన చార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత విమాన టికెట్ ధరలు పెరగడం ప్రారంభమవుతుంది. బుకింగ్‌లు పెరిగేకొద్దీ విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఈద్ అల్ ఫితర్ వారంలో ఛార్జీలు రెట్టింపు కంటే ఎక్కువ అవుతాయి. ఈద్ వారంలో బంధువులను, తమకు ఇష్టమైన వారిని కలవడానికి లేదా విహారయాత్రల కోసం ప్రయాణించాలనుకునే వారు ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఆదాయ నిర్వహణ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. డిమాండ్ పెరిగే కొద్దీ విమాన ఛార్జీలను అవి పెంచుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com