ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం
- February 21, 2022
హైదరాబాద్: ఏపీలో విషాదం నెలకొంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది.ఆయన పరిస్థితి సీరియస్ గా వుండడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన చూసుకుని నిన్ననే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 50 ఏళ్ళు.
రెండ్రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చారు మేకపాటి గౌతమ్రెడ్డి. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు గౌతమ్రెడ్డి. జగన్ కేబినెట్లో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గౌతమ్రెడ్డి. 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. గౌతమ్రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మం. బ్రాహ్మణపల్లి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి. నెల్లూరు జిల్లా పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా పేరుపొందారు.
మేకపాటి గౌతమ్రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఇతను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకె లో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







