తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 21, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల 386 కరోనా పరీక్షలు చేయగా 385 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో గడిచిన 24గంటల్లో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,78,167 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 4వేల 787 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, క్రితం రోజు 256 కరోనా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









