తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- February 21, 2022 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల  386 కరోనా పరీక్షలు చేయగా 385 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో గడిచిన 24గంటల్లో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,78,167 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 4వేల 787 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, క్రితం రోజు 256 కరోనా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com