యుక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం..సర్వత్రా ఉత్కంఠ
- February 22, 2022
యుక్రెయిన్ - రష్యా ఉద్రిక్తల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి.
ప్రస్తుతం 'యూఎన్ రొటేటింగ్ కౌన్సిల్ ప్రెసిడెన్సీ'గా వ్యవహరిస్తున్న రష్యా ఈ సమావేశాన్ని రాత్రి 9 గంటలకు(న్యూయార్క్ కాలమానం ప్రకారం) షెడ్యూల్ చేసింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కార్యాలయంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, చైనా మరియు ఫ్రాన్స్ లతో పాటుగా రష్యాకు కూడా శాశ్వత సభ్యత్వం ఉంది. దీంతో భద్రతా మండలిలో ప్రవేశ పెట్టె బిల్లులకు అంగీకారం - తిరస్కారం తెలిపే హక్కుగా చెప్పబడే 'వీటో పవర్' ఆయా సభ్యదేశాలకు ఉంటుంది. ఈక్రమంలో నేడు నిర్వహించిన అత్యవసర సమావేశంలో రష్యా ఎటువంటి ప్రకటన చేస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఉక్రెయిన్లోని లుహాన్స్క్ మరియు డొనెట్స్క్ అనే రెండు ప్రావిన్సులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు సోమవారం రష్యా ప్రకటించింది.
"The next hours & days will be critical. The risk of major conflict is real & needs to be prevented at all costs."
— United Nations (@UN) February 22, 2022
-- UN political chief @DicarloRosemary briefing the Security Council on Ukraine. https://t.co/90J8uSLo2G
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







