కిలీ పాల్కు భారత హైకమిషన్ సత్కారం
- February 22, 2022
టాంజానియా: ఇంటర్నెట్ సెన్సేషన్ కిలీ పాల్ను టాంజానియా లోని భారత హైకమిషన్ సత్కరించింది. హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన కిలీ పాల్తో భారత దౌత్యవేత్త బినయ ప్రధాన్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. కిలీ పాల్ టిక్ టాక్ వీడియోల నుంచి వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఇన్స్టా, తదితర సోషల్ మీడియా సైట్లల్లో ఆయన ఫాలోవర్లు రెండు మిలియన్లకు పైగా ఉన్నారు. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ , టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి’ పాటకు కూడా స్టెప్పులేసి కిలీ పాల్ తన ఫాలోవర్లను ఫిదా చేశాడు . కిలీ పాల్ను సత్కరించిన ఫొటోలను భారత హైకమిషన్ ట్విట్టర్లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









