తెలంగాణ కరోనా అప్డేట్

- February 22, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 579 కరోనా పరీక్షలు చేయగా, 374 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 39, నల్గొండ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో మరొకరు కరోనాతో మరణించారు.

మరో 683 కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,437 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,78,850 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 4వేల 477 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,110కి పెరిగింది. క్రితం రోజుతో(385) పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com