దుబాయ్ లో ప్రారంభమైన ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’
- February 23, 2022
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించే మరో టూరిస్టు ప్లేస్ అందుబాటులోకి వచ్చింది. ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మనిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ లతోపాటు వందలాది మంది గెస్ట్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్టింగ్ ప్రోగ్రామ్ లు, లైటింగ్ ఎఫెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ దుబాయ్ స్కైలైన్ ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ను ఫిబ్రవరి 23, బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతించనున్నారు. ఎంట్రన్స్ ఫీ Dh145 గా నిర్ణయించారు.పిల్లలు, ఎమిరాటీ సీనియర్లకు కాంప్లిమెంటరీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









