కేంద్ర కేబినెట్తో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం
- February 24, 2022
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు.ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడివల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితం అవుతుంది? దానిని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశాలపై ఈ సమావేశం చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం ధరల పెరుగుదల, చమురు ధలర పెరుగుదల, స్టాక్ మార్కెట్ల పతనం.. ఈ అంశాలన్నీ చర్చకు రానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









