బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో సరికొత్త గేమ్ ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ
- February 26, 2022
ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టెక్నాలజీల్లో బ్లాక్ చెయిన్, మెటావర్స్ టెక్నాలజీలు పటిష్టమైనవి. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేస్తు హైదరాబాద్కు చెందిన గేమింగ్ ఇండస్ట్రీ ఓ గేమ్ను క్రియోట్ చేసింది. ఈ గేమ్ లో హైలెవల్ కు వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను గెలుచుకోవచ్చని, ఈ టోకెన్లను క్రిప్టో ఎక్చేంజ్ ద్వారా సొమ్ము చేసుకోవచ్చని గేమ్ తయారీదారులు చెబుతున్నారు. హైదరాబాద్ స్టార్టప్ సంస్థ క్లింగ్ ట్రేడింగ్ సంస్థ ఈ గేమ్ను రూపొందించింది. ప్రస్తుతం బీటా వెర్షన్ మార్చిలో అందుబాటులోకి రానున్నట్టు గేమింగ్ నిర్వహాకులు తెలిపారు.
2022 జూన్ నుంచి ఈ గేమింగ్ ఫుల్ వెర్షన్ సామన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని క్లింగ్ ట్రేడింగ్ సంస్థ తెలియజేసింది. ఆ గేమింగ్లో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోయే కొలది క్రిప్టో టోకెన్లు గెలుకుంటారు. అయితే, ఈ క్రిప్టో టోకెన్లను నగదుగా మార్చుకునేందుకు వీలుగా పాన్కేక్ స్వాపింగ్ డీ సెంట్రలైజ్డ్ ఎక్చేంజీతో ఒప్పందం చేసుకున్నట్టు నిర్వహకులు పేర్కొన్నారు. ఒకేసారి అనేక మంది ఈ గేమ్ను ఆడేందుకు వీలుగా మెటావర్స్ టెక్నాలజీని పొందుపరిచారు. దీంతో వర్చువల్గా ఒకేసారి అనేకమంది ఈ గేమ్ను ఆడేందుకు వీలు ఉంటుందని క్లింగ్ ట్రేడింగ్ సంస్థ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







