1 రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. సేవలు ప్రారంభించిన చిన జీయర్ స్వామి
- February 26, 2022
హైదరాబాద్: ఆరోగ్యం.. ఆహారం లేకుండా అసలు జీవితమే లేదని త్రిదండి పీఠాధిపధి చిన జీయర్ స్వామి సెలవిచ్చారు. అనారోగ్యాల కోసం జనం భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతోన్న ప్రస్తుత కాలంలో అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందిస్తోన్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడ ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ సేవలను జీయర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని రామ్ నగర్ ప్రాంతంలో గల సీజీ చారిటీ ఆస్పత్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డాక్టర్ గంగాధర్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్ నగర్లో కొనసాగుతున్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని చిన జీయర్ సందర్శించారు. ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రారంభించారు.పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు... అతి తక్కువ ధరలో వైద్యాన్ని అందించడం ప్రశంసనీయమని జీయర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీజే ఛారిటీ ఆస్పత్రి నిర్వాహకులు.. చిన్నజీయర్ స్వామికి పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









