1 రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. సేవలు ప్రారంభించిన చిన జీయర్ స్వామి
- February 26, 2022
హైదరాబాద్: ఆరోగ్యం.. ఆహారం లేకుండా అసలు జీవితమే లేదని త్రిదండి పీఠాధిపధి చిన జీయర్ స్వామి సెలవిచ్చారు. అనారోగ్యాల కోసం జనం భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతోన్న ప్రస్తుత కాలంలో అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందిస్తోన్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడ ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ సేవలను జీయర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని రామ్ నగర్ ప్రాంతంలో గల సీజీ చారిటీ ఆస్పత్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డాక్టర్ గంగాధర్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్ నగర్లో కొనసాగుతున్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని చిన జీయర్ సందర్శించారు. ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రారంభించారు.పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు... అతి తక్కువ ధరలో వైద్యాన్ని అందించడం ప్రశంసనీయమని జీయర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీజే ఛారిటీ ఆస్పత్రి నిర్వాహకులు.. చిన్నజీయర్ స్వామికి పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు







