దుబాయ్లో ఇద్దరు ఆఫ్రికన్లకు 3 ఏళ్ళ జైలు శిక్ష
- March 02, 2022
దుబాయ్: హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఇద్దరు ఆఫ్రికన్లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. UAE కుటుంబానికి పనిమనిషిగా ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి దుబాయ్ కి తీసుకొచ్చి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుగా తనను బంధించారని గత జూన్లో ఒక ఆఫ్రికన్ అమ్మాయి పెట్రోలింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తనను ఆఫ్రికన్ వ్యక్తులు నిర్బంధించడమే కాకుండా.. తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన కార్యకలాపాలు చేసేందుకు బలవంతం చేశారని ఫిర్యాదులో చెప్పింది. Dhs 20,000 చెల్లించే వరకు తాము చెప్పిన పని చేయాలంటూ బలవంతం చేశారని పోలీసుల ఎదుట బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలో అనారోగ్యం పేరిట తప్పించుకొని తనకు తెలిసిన ఓ వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందింది. అతడు ఆమె పాస్ పోర్ట్ కోసం ముఠా సభ్యులను ప్రశ్నించగా.. సదరు వ్యక్తిని బంధించి చిత్రహింసలు పెట్టి బాధితురాలు ఉన్న అడ్రస్ ని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని ముఠా సభ్యులు తరలించే క్రమంలో పెట్రోలింగ్ సిబ్బందిని చూసి చూసి సహాయం కోసం అరవడంతో భయంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి పారిపోతుండగా.. పోలీసులు పట్టుకొని విచారించడంతో జరిగిన ఘోరం బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







