తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు

- March 05, 2022 , by Maagulf
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్​లకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగ్‌లు ఇచ్చింది. హైదరాబాద్ పరిపాలనా విభాగం సంయుక్త కమిషనర్‌గా రమేశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా రాజేష్ చంద్ర… దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, తూర్పు మండల డీసీపీగా సతీశ్‌కు తాత్కాలిక బాధ్యతలిచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. రెండు రోజుల క్రితమే డీసీపీ విజయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com