పుతిన్ తో మాట్లాడండి..యుద్దాన్ని ఆపండి..మోడీ ని కోరిన ఉక్రెయిన్
- March 06, 2022
రష్యా తమపై దాడులను ముమ్మరం చేయడంతో ఉక్రెయిన్ మరోసారి భారత్ మద్దతు కోరింది. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది.
యుద్ధ పరిణామాలను పుతిన్కు మోదీ వివరించాలని అన్నారు. యుద్ధం ప్రపంచ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని పుతిన్కు భారత్ వివరించాలని ఉక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకునే అతి పెద్ద వినియోగదారు భారతేనన్నారు. యుద్ధం కొనసాగితే కొత్త పంటలను వేయడం సాధ్యం కాదని దిమిత్రో అన్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే భారత్ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. భారత తమ ఆహార భద్రత కోసమైనా యుద్ధాన్ని ఆపడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇదే విధంగా ఓ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆహార భద్రతకు హామీ ఇస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి అని తెలిపింది. తమ దేశంలో ఉత్పత్తి అయిన సన్ఫ్లవర్ ఆయిల్లో 55 శాతం మేరకు ప్రపంచానికి ఎగుమతి అవుతోందని తెలిపింది. ఈ యుద్ధం భారత ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అయినా యుద్ధాన్ని ఆపాలని పుతిన్కు భారత్ చెప్పాలని ఉక్రెయిన్ తెలిపింది. తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం భారత్లోనే ఎక్కువని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







