రైళ్లలో హాఫ్ టికెట్కు బర్త్ రిజర్వేషన్ లేదు..
- March 31, 2016
రైళ్లలో ప్రయాణించే ఐదునుంచి పన్నెండేళ్ల వయస్సున్న పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్తులు రిజర్వ్ చేసుకోవాలంటే వారికి కూడా పెద్దవారితో సమానంగా పూర్తి టికెట్ కొనాల్సిందే. హాఫ్ టికెట్ కొంటే వారికి బెర్తులు కేటాయించరు. ఈ విధానం నేటినుంచి అమల్లోకి వచ్చింది. 5నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు రైళ్లలో ప్రయాణించడానికి రైల్వే శాఖ టికెట్ ఛార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుంది.దీనిని మనం హాఫ్ టికెట్ అంటూ వ్యవహరిస్తుంటాం. ప్రతియేటా సుమారు రెండున్నర కోట్ల మంది చిన్నారులు హాఫ్టికెట్తో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఇన్నాళ్లూ తమ పిల్లలతో ఊళ్లకు వెళ్లే తల్లిదండ్రులు వారికి హాఫ్ టికెట్ తీసుకున్నా ప్రత్యేకంగా బెర్తులు కేటాయించేవారు. ఈ విధానానికి రైల్వే శాఖ స్వస్తి చెప్పింది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో ప్రయాణీకుల ఛార్జీలు పెంచని కారణంగా ఎదురయ్యే లోటును భర్తీ చేసుకోవడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







