టాలీవుడ్కు శుభవార్త..
- March 07, 2022
అమరావతి: టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నాన్ ఏసీ థియేటర్, ఏసీ థియేటర్, మల్టీప్లెక్స్ల వారీగా టిక్కెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియం కేటగిరిలుగా టిక్కెట్ రేట్లను విభజించింది.
మున్సిపల్ కార్పొరేషన్లలో (ఉదాహరణకు విజయవాడ, గుంటూరు, విశాఖ) నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40… ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70, స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100, మల్టీప్లెక్సులలో రూ.150గా టిక్కెట్ రేట్లను నిర్ణయించింది. ఒకవేళ రిక్లయినర్ సీట్లు ఉంటే రూ.250గా విక్రయించుకోవచ్చని సూచించింది.
మున్సిపాలిటీలలో (ఉదాహరణకు తెనాలి, ఏలూరు, భీమవరం, చీరాల) నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30… ఏసీ థియేటర్లలో రూ.80, 60, స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80, మల్టీప్లెక్సులలో రూ.125గా టిక్కెట్ రేట్లను నిర్ణయించింది.
గ్రామ పంచాయతీలలో (సి, డి సెంటర్లు) నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20, ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50, స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70, మల్టీప్లెక్సులలో రూ.100గా టిక్కెట్ రేట్లను నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









