అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
- March 08, 2022న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది.ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు,అది కూడా ప్రభుత్వ అనుమతితో..మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక, త్వరలోనే రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.దీనిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం…ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.కోవిడ్ విజృంభణతో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగరబోతున్నాయి.
కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా విజయవంతం అయ్యిందని..కోవిడ్ కేసులు తగ్గిపోవడం.. వ్యాక్సినేషన్ క్రమంగా పెరగడంతో…సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్టు..ఇక, ఆ రోజు నుంచి అంతర్జాతీయ విమానాలను యథాతథంగా షెడ్యూల్ చేస్తామని కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం