గోవాలో బీజేపీ మూడోసారి గెలుపు
- March 10, 2022
పనాజీ: గోవాలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది భారతీయ జనతా పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ స్థానాలకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయినా.. స్వతంత్రుల మద్దతుతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు రెడీ అయిపోయింది.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 20 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో, టీఎంసీ 2, ఆమ్ఆద్మీ పార్టీ 2, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు..
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో.. ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు స్వతంత్ర అభ్యర్థులు. బిచోలిమ్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్చంద్రకాంత్ శెట్టి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇక, కొర్టాలిమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అలెక్జియో రెజినాల్డో కూడా బీజేపీకే జై కొట్టారు.. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మార్గం సుగమం అయ్యింది. ఇక, మరోసారి గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్. పార్టీ కార్యకర్తల కృషితోనే ఈ ఎన్నికల్లో విజయం సాధ్యమైందన్న ఆయన.. గోవాలో బీజేపీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.. కాగా, సాంకేలిమ్స్థానం నుంచి పోటీ చేసిన సావంత్..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 650 ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







