అబుధాబి ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ సోమవారం ప్రారంభం
- March 12, 2022
అబుధాబి: ఎమిరేట్ వ్యాప్తంగా ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అబుధాబి ఎక్స్ప్రెస్ అనే సర్వీస్ ప్రారంభం కానుంది. సోమవారం ఈ సర్వీసు ప్రారంభమవుతుంది. డైరెక్ట్ నాన్ స్టాప్ బస్సుల్ని ప్రైవేటు రంగానికి చెందిన ఆపరేటర్లు నిర్వహిస్తారని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ - డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెల్లడించింది. తొలి ఫేజ్లో భాగంగా ముసాఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియా మరియు మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ మధ్య బస్సులు నడుస్తాయి. రెండో ఫేజ్ విషయానికొస్తే ఖలీఫా సిటీ, బని యాస్, అల్ షమామా, అల్ ఫలాహ్ మరియు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ ప్రాంతాల్ని నేరుగా అబుదాబీతో కనెక్ట్ చేస్తారు. రెండో ఫేజ్లో అల్ అయిన్కి పలు ప్రాంతాలతో కనెక్ట్ చేస్తారు. వారంలో మొత్తం 680 ట్రిప్పులు వుంటాయి. అబుదాబీ సిటీ ప్రధాన బస్ స్టేషన్ని ఈ బస్సులు వినియోగిస్తాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు నడుస్తాయి. ప్రతి పదిహేను నుంచి 30 నిమషాలకు ఓ బస్సు అందుబాటులో వుంటుంది.. రద్దీకి అనుగుణంగా.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







