ఆన్లైన్ చెల్లింపు మోసానికి పాల్పడ్డ వారికి 10 ఏళ్ల జైలు!
- March 13, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రభుత్వ పోర్టల్ ద్వారా నకిలీ చెల్లింపులు చేసినందుకు ఆరుగురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై మోసం, ఫోర్జరీ అభియోగాలు మోపింది. నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నకిలీ చెల్లింపులను ధృవీకరించడానికి పేమెంట్ పోర్టల్లోని డేటాను ట్యాంపర్ చేయడానికి నిందితులు eKeyలను ఉపయోగించారని కోర్టు ఫైల్లు చెబుతున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోర్టల్లో అసాధారణ లావాదేవీలను గమనించిన తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నివేదిక ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. తమ బిల్లులను సెటిల్ చేసేందుకు విదేశీ బ్యాంకుకు చెందిన చెల్లని క్రెడిట్ కార్డును ఆరుగురు నిందితులు ఉపయోగించినట్టు విచారణలో గుర్తించారు. నిందితులు పోర్టల్లోని పలువురి ఇ-కీలను దుర్వినియోగం చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అరెస్టయిన్ వారిలో జిసిసి దేశంలో పరారీలో ఉన్న వాంటెడ్ వ్యక్తి కూడా ఉన్నారు. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అతన్ని అరెస్టు చేసి బహ్రెయిన్కు పంపించారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!









