బిస్కట్ పై జీడి పప్పు బదులు చనిపోయిన ఈగ దాని గుడ్డు
- April 01, 2016
ఒక స్థానిక దుకాణ సముదాయం వద్ద దుబాయ్ నివాసి ఆఫర్లో బిస్కెట్లు కొనబోతే చనిపోయిన ఒక ఈగ దాని తాలుకా గుడ్లు ఉచితంగా ఆయనకు లభించాయి. 50 ఏళ్ల దుబాయ్ నివాసి రాబర్టో ఘెర్గిఒ ( ఆయన పేరు మార్చబడింది ) ఒక బిస్కెట్లు ప్యాకెట్ తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో పురపాలక సంఘంకు ఒక ఫిర్యాదు చేశాడు. స్పందించిన దుబాయ్ మున్సిపాలిటీ బిస్కెట్లు తయారీ సంస్థకు జరిమానా విధించింది. ఈ మార్చి మొదటి వారంలో ఆయన స్థానిక కిరాణా దుకాణ సముదాయం వద్ద " జీడిపప్పు కుకీలు గల ఆరు బిస్కట్ ప్యాకెట్ లు కొనండి...మరో రెండు బిస్కట్ ప్యాకెట్లు ఉచితంగా పొందండి " అనే వాణిజ్య ప్రకటన చూసి ఘెర్గిఒ ఆశపడి వాటిని కొన్నాడు. ఎంత చవక ఎంత చవకని అని రెండు ప్యాకెట్ల ఆనందంగా ఆరగించాడు. ఆ రుచికి ఆగలేక మూడవ బిస్కట్ ప్యాకెట్ తెరిచి ఒక బిస్కెట్లు నోటిలో పెట్టుకోబోతుండగా దానిపై చనిపోయిన ఒక ఈగ, ఈగ గుడ్లు చక్కగా జీడిపప్పు మాదిరిగా అతుక్కుపోయి వెక్కిరిస్తూ ఆయనకు కనబడింది. బిస్కెట్లు ప్యాకేజింగ్ ప్రకారం, సెప్టెంబర్లో ముగిసిపోతున్నట్లు దానిపై ముద్రితమై ఉంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







