కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం తగ్గింపు
- March 20, 2022
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం తగ్గింది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ తొలి డోసు-రెండో డోసుకు మధ్య 12-16 వారాల విరామం ఉండగా, ఇప్పుడు అది 8-16 వారాలకు తగ్గింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టాగి) పేర్కొంది. కొవిషీల్డ్ రెండో వ్యాక్సిన్ ను 8 వారాల తర్వాత ఇచ్చినప్పుడు, 12-16 వారాల తర్వాత ఇచ్చినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల ప్రతిస్పందన దాదాపు సమానంగా ఉన్నట్టు ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఎన్టాగి ఈ ప్రతిపాదన చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తూ భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించడం వల్ల మిగిలిన 6-7 కోట్ల మందికి వ్యాక్సినేషన్ సులభమవుతుందని భావిస్తున్నారు.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకా విషయంలో రెండు డోసుల మధ్య విరామంలో ఎలాంటి మార్పు లేదని ఎన్టాగి పేర్కొంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం 28 రోజులుగా ఉంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేశాయి. దీనికి పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







