ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానం కరాచీలో అత్యవసర ల్యాండింగ్
- March 21, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన QR579 విమానాన్ని కరాచీలో అత్యవసరంగా దింపినట్లు అధికారులు తెలిపారు.
విమానంలోని కార్గో ప్రాంతంలో పొగలు రావటం గమనించిన సిబ్బంది వెంటనే సమీపంలోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా సురక్షితంగా ఉన్నట్లు సంస్ధ తెలిసింది.
ప్రయాణికులను కిందకు దింపి సమస్యను పరిష్కరిస్తున్నారు.ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 3.50 నిమిషాలకు విమానం బయలుదేరింది.ఆ తర్వాత అది కరాచీలో 5.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్ ఉన్న ప్రయాణికులు అందులో ఉన్నారు.
ప్రయాణికులు దోహా వెళ్లటానికి రిలీఫ్ ప్లైట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని…. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







